14, ఏప్రిల్ 2016, గురువారం

ఇదీ సంగతి..

ట్రైన్ ఢీకొని 99 మంది చనిపోయారు..అదృష్టం కొద్దీ ఒకడు బతికాడు..
వాడిని ఓ టీవీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నాడు
రిపోర్టర్ : చెప్పండి సర్ ఈ దుర్ఘటన ఎలా జరిగింది?
ఒకడు   : రైల్వే అధికారుల నిర్లక్ష్యం... ఒక తప్పుడు ప్రకటన వల్ల ఇదంతా జరిగింది
రిపోర్టర్ : ఎలా తప్పుడు ప్రకటన సర్
ఒకడు  : ఇంకొద్దీ సేపట్లో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అని ప్రకటన చేశారు సర్...
           దానితో అందరూ భయపడి పట్టాల మీదకి  వెళ్ళిపోయారు.. కాని వాళ్ళ దురదృష్టం ఏంటంటే
            ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు పట్టాల మీదకి వచ్చింది.
రిపోర్టర్ : అయితే మీరు తెలివిగా  తప్పించుకున్నారుగా సర్..
ఒకడు  : తొక్కేమ్ కాదు నాపాటికి నేను ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపై
            పడుకున్నా.... కానీ ప్రకటన విన్నాక వెళ్లి ప్లాట్ఫామ్ పై పడుకున్నా...
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి